Sunday, May 5, 2024
- Advertisement -

చిరంజీవికి ఆ స్కూల్స్ కి ఏం సంబంధం లేదు..

- Advertisement -

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం తన తదుపరి చిత్రం సై రా నరసింహ రెడ్డి షూటింగ్ తో బిజీ గా గడుపుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే తాను ఈ సినిమా కోసం చాలా కష్ట పడుతున్న తరుణం లో అనవసరం గా సినిమా విడుదల గురించి లేనిపోని పుకార్లు వస్తున్నాయి. సినిమా మొదలైన దగ్గర నుండి పూర్తి చేసే వరకు దర్శకుడు సురేందర్ రెడ్డి చాలా జాగ్రత్తగా ఈ సినిమా ని తీర్చిదిద్దాలనే సంకల్పం తో పని చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే తాజా గా చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్ పేరు తో శ్రీకాకుళం లో కొన్ని ప్రకటనలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో చిరంజీవి ఫౌండర్ ప్రెసిడెంట్ గా, చరణ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, నాగ బాబు చైర్మన్ గా వ్యవహరించనున్నట్లు కూడా ఆ వార్తల్లో తెలిసింది.

అయితే తాజా గా స్కూల్ వారు ఒక పత్రికా ప్రకటన ఇచ్చారు. దాని ప్రకారం అసలు చిరంజీవి కి ఈ స్కూల్స్ కి ఏమి సంబంధం లేదు అంట. కేవలం చిరంజీవి అభిమానులకి, మరియు పెద్ద ప్రజలకి చదువు అందించాలి అనే ఆశయం తో, వారికి తక్కువ ఫీజు తో విద్య ని అందించాలనే తపన తో చిరంజీవి మీద అభిమానం తో ఆయన పేరు పెట్టుకున్నారట. అంతే కాకుండా వారి మీద ఉన్న గౌరవం తో నే వారి పేర్లని బోర్డు లో చేర్చారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -