Wednesday, May 22, 2024
- Advertisement -

చిరంజీవిని తిట్టుకొన్న శ్రీవారి భక్తులు..!

- Advertisement -

తిరుమలలో సెలబ్రిటీలు సామాన్యులను ఇబ్బందులు పెట్టడం కొత్తమే కాదు.. సినిమా వాళ్లు, రాజకీయ నేతలు, ఇతర సామాజిక ప్రముఖులు శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చి ప్రత్యేక ప్రాధాన్యత పొందుతున్నారు.

స్వామి వారిని దర్శించుకోవడం వీఐపీ ట్రీట్ మెంట్ పొందుతున్నారు.

మరి వీరి కోసం టీటీడీ చేసే ప్రత్యేక ఏర్పాట్లు సామాన్య భక్తుల పాలిట ఇబ్బందిగా మారుతున్నాయి. క్యూలైన్లలో గంటలు, పూటల పాటు వేచి ఉండే భక్తులకు సెలబ్రిటీలతో మరింత ఇబ్బందులు కలుగుతున్నాయి.

సెలబ్రిటీలు ప్రత్యేక దర్శనాల్లో శ్రీవారిని దర్శించుకొంటున్న సమయంలో క్యూలైన్లను ఆపివేస్తారు. దీంతో అప్పటికే వేచి ఉన్న భక్తులకు మరింత టార్చర్ కనిపిస్తోంది. ఇప్పుడు విశేషం ఏమిటంటే.. తిరుమలలో శ్రీవారి భక్తులకు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి పుణ్యాన ఇక్కట్లు కలిగాయి. శనివారం తిరుమలలో వివరీతమైన రద్దీ ఉన్న సమయంలో చిరంజీవి దర్శనానికి వచ్చారు. దీంతో ఆయన ప్రత్యేక దర్శనం ఏర్పాట్ల కోసం అంటూ టీటీడీ అధికారులు క్యూ లైన్లను ఎక్కడిక్కడ ఆపేశారు!

దీంతో భక్తులకు చుక్కలు కనిపించాయి. కొన్ని క్యూలైన్లలోకి అసలు భక్తులనే అనుమతిని ఇవ్వక.. ఆల్రెడీ జనాలు ఉన్న క్యూ లైన్లను ఎక్కడివక్కడ ఆపివేయడంతో.. వాటిల్లో వేచి ఉన్నవారు ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. తన తనయుడు కొత్తగా విమానయాన సంస్థ ను ప్రారంభించిన నేపథ్యంలో చిరంజీవి ప్రత్యేక పూజల కోసం తిరుమల వచ్చారు. ఆయన కు టీటీడీ చేసిన ప్రత్యేక దర్శన, పూజల ఏర్పాట్లు ఈ విధంగా సామాన్యులను ఇబ్బంది పెట్టాయి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -