చేపలకూర తినే సంయంలో వారి కొంప ముంచింది.రెండు రాష్ట్రాల కార్మికుల మద్య గొడవకు దారి తీసంది చేపలకూర.ఈ ఘటనపై భద్రాచలం పోలీస్స్టేషన్లో కేసు నమోదయింది.చేపలకూర ఏంటి రెండు రాష్ట్రాలుల మధ్య చిచ్చు అనుకుంటున్నారా.మీరు విన్నది నిజం.
గోదావరిపై జరుగుతున్న రెండవ వారధి నిర్మాణ పనుల నిమిత్తం బీహార్, వెస్ట్బెంగాల్కు చెందిన కార్మికులు వలస వచ్చి పనుల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి బీహార్కు చెందిన కార్మికులు చేపలు తెచ్చుకొని వంట చేసుకొని తినటానికి సిద్ధమయ్యారు.
{loadmodule mod_custom,GA1}
ఇక్కడే అసలు కథ మొదలయ్యింది. మద్యం సేవించి బెంగాల్కు చెందిన కార్మికులు చేపలకూర కావాలని అడగడంతో..గొడవ మొదలయ్యింది. కూరను ఇచ్చేదిలేదని బీహార్ కార్మికులు చెప్పడంతో వాగ్వాదానికి దిగిన వెస్ట్బెంగాల్ కార్మికులు ఆగ్రహంతో అక్కడే ఉన్న కర్రలు, ఇనుప రాడ్లతో వారిపై దాడికి దిగారు.దాడిలో తీవ్రంగా గాయపడిన వారిని స్తానిక అసుపత్రిలో చేర్పించారు.
బీహార్ కార్మికులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకొని పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.చూశారుగా చేపలకూర ఎంతపనిచేసిందో.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}9DCyXiZQmjw{/youtube}
