Tuesday, May 7, 2024
- Advertisement -

వైసీపీ కేంద్ర కార్యాలయంను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్….

- Advertisement -

అమరావతి కేంద్రంగా వైసీపీ పార్టీ కార్యకలాపాలు సాగించనుంది. తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయం శనివారం ప్రారంభమయ్యింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. బాపట్ల ఎంపీ నందిగం సురేశ్, పార్టీ నేత ఆమంచి కృష్ణమోహన్ చేత జగన్ రిబ్బన్ కట్ చేయించారు. అనంతరం పార్టీ కార్యాలయంలోని అన్ని విభాగాలను పరిశీలించిన జగన్ ఆఫీసులోని తన ఛాంబర్‌లో ఆశీనులయ్యారు.

ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, శ్రేణులు హాజరయ్యారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలోనే కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. బ్యాక్ ఆఫీస్, సోషల్ మీడియా విభాగం, మీడియా కోఆర్డినేషన్ ఇలా పార్టీకి చెందిన విభాగాలన్నీ కేంద్ర కార్యాలయం నుంచే పనిచేస్తాయి. ప్రెస్‌మీట్లు, పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఇకపై ఇక్కడే నిర్వహించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -