Friday, April 19, 2024
- Advertisement -

సీఎం జగన్ కొత్త ‘కాన్సెప్ట్’ ఇదే

- Advertisement -

సమాంతర అభివృద్ధి – సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా పాలన చేస్తున్నారు సీఎం వైయస్ జగన్. కాన్సెప్ట్ సిటీల ద్వారా వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో కార్సెప్ట్ సిటీల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

కాన్సెప్ట్ ఏమిటి?
10 చ.కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ కాన్సెప్ట్ సిటీలను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ప్రతి నగరం వివిధ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా ఉండాలని సూచించారు. వేగంగా పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసే విధివిధానాలు ఉండేలా చర్యలు తీసకుంటారు. పరిశ్రమలు పెట్టే సంస్థలకు ప్రోత్సాహక ధరలతో భూమి, నీరు, విద్యుత్ ఇస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. పట్టణాలకు అనుబంధంగా ఉండే ఈ కాన్సెప్ట్ సిటీల ద్వారా పెట్టుబడులకు పెద్ద ఎత్తున స్వాగతం లభిస్తుందని ఆశిస్తున్నారు. గత ప్రభుత్వం రూ.4000 కోట్లు పారిశ్రామిక ప్రోత్సాహకాలు పెండింగ్‌లో పెట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటూ కోతలు కోసింది. కానీ పారదర్శక విధానం ద్వారా సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలని, వాస్తవికంగా పారిశ్రామిక అభివృద్ధి కోసం పని చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

అభివృద్ధి వికేంద్రీకరణ
తెలంగాణాలో హైదరాబాద్ మాత్రమే అభివృద్ధికి చిరునామాగా నిలిచింది. గత ప్రభుత్వం తమ స్వంత ప్రయోజనాల కోసం ఒక కుల రాజధానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. దీనివల్ల అభివృద్ధి కేంద్రీకరణ జరిగి, ఇతర ప్రాంతాలు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిపోతాయి. కనుక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు అభివృద్ధిని వికేంద్రీకరించేందుకు కాన్సెప్ట్ సిటీ ప్రణాళిక ఉపయోగపడుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -