Friday, April 19, 2024
- Advertisement -

నవాజ్​ షరీఫ్ ని నేరస్థుడిగా ప్రకటించిన కోర్టు..!

- Advertisement -

పాకిస్థాన్​ మాజీ ప్రధాని నవాజ్​ షరీఫ్​ను ఇస్లామాబాద్​ హైకోర్టు నేరస్థుడిగా ప్రకటించింది. అల్​ అజీజియా, అవెన్​ఫీల్డ్ గ్రాఫ్ట్ కేసులకు సంబంధించిన కేసుల్లో నవాజ్ షరీఫ్​ అప్పీళ్లపై జస్టిస్​ అమీర్​ ఫరూఖ్​, జస్టిస్​ మొహ్సిన్​ అక్తర్​లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. నోటీసులు పంపినప్పటికీ న్యాయస్థానం ఎదుట షరీఫ్​ హాజరు కాకపోవడంపై ధర్మాసం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై అధికారులను వివరణ కోరింది.


లండన్​, లాహోర్​లలోని షరీఫ్​ నివాసానికి సమాచారం పంపినట్లు విదేశాంగ శాఖ, అంతర్గత వ్యవహారాలు శాఖ కార్యాలయ అధికారులు.. కోర్టుకు నివేదించారు. అయినప్పటికీ షరీఫ్​ హాజరు కాకపోవడం వల్ల ఆయనను అపరాధిగా ప్రకటిస్తూ ధర్మాసనం తీర్పు ఇచ్చింది.

గుండె సంబంధిత చికిత్స కోసం లాహోర్​ హైకోర్టు అనుమతితో గతేడాది నవంబర్​లో లండన్​ వెళ్లిన షరీఫ్​.. అక్కడే తలదాచుకుంటున్నారు.సెప్టెంబర్​ 15న ఆయనపై నాన్​ బెయిలబుల్ అరెస్ట్​ వారెంట్​ జారీ చేసింది న్యాయస్థానం. కానీ, షరీఫ్​ ఆ వారెంట్​ను ​ తిరస్కరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -