- Advertisement -
బేగంపేట విమానాశ్రయంలో విమానం కూలిపోయింది. అయితే అది ప్రయాణీకులు ఉన్న విమానం కాదు. కండీషన్ లో లేని యుద్ధ విమానం. దీన్ని క్రేన్ సాయంతో దుండిగల్ తరలించేందుకు అధికారులు ఆదివారం తెల్లవారుజామున ఏర్పాట్లు చేశారు.
క్రేన్ వచ్చి విమానాన్ని తరలిస్తున్న సమయంలో విమానాశ్రం వెనుక వైపు ఉన్న గోడ వద్ద అది కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు కాని అక్కడే ఉన్న తిరుమల తిరుపతి దేవస్ధానం వారి వేద పాఠశాల ప్రహారి గోడ పాక్షికంగా దెబ్బతింది.