వరుస హత్యలు వెలుగు చూసిన యాదాద్రిభువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎటువంటి సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు. నిందితుడు శ్రీనివాసరెడ్డి ఇంటికి నిప్పుపెట్టడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
తమ ఊరి ఆడ బిడ్డలను అత్యంత కిరాతకంగా హత్యలు చేసిందన్న విషయాన్ని జీర్ణించుకోలేని హాజీపూర్ ప్రజలు, సైకో మర్రి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి నిప్పు పెట్టారు. శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం రాచకొండ పోలీసుల అదుపులో ఉండగా, అతని కుటుంబీకులు గత రాత్రి ఊరు వదిలి పారిపోయారు. అడ్డుకున్న పోలీసులపైనా దాడికి యత్నించారు.. శ్రీనివాస్రెడ్డిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. పోలీసులు సైతం గ్రామ ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చలేకపోయారు. గ్రామంలో పరిస్థితి మరింత అదుపు తప్పకుండా అదనపు బలగాలను రప్పించారు.