హెచ్ఐవి ఉందని చెప్పినా మైనర్ బాలికను బలవంతంగా పెళ్లి చేసుకొని ఇంట్లోనె బంధించి మూడు నెలలపాటు లైంగిక దాడి చేసి నరకం చూపించిన కామాంధుడి గుట్టు రట్టు అయ్యింది.ప్రేమ, పెళ్లి అంటూ వెంటపడి.. బలవంతంగా మెడలో తాళికట్టి.. బెదిరించి కాపురం చేశాడు. కామాంధుడి చెరనుంచి బయట పడిన బాలిక పోలీసులను ఆశ్రయించింది. ఈ సంగటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెల్తే…. ఎమ్మిగనూరు పట్టణం గాంధీనగర్ కి చెందిన ఓ మహిళ 2015లో హెచ్ఐవీ తో కన్నుమూసింది. ఆమె వ్యాధి కూతురికి కూడా సోకింది. దీంతో బాలిక నాన్న ఆదోని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు నాన్నను సంప్రదించి.. హెచ్ఐవీకి చికిత్స అందిస్తూ చదివిస్తామన్నారు.
చికిత్స తీసుకుంటూనె ఆదోని పట్టణంలోని ఓ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. కొన్ని నెలల క్రితం తండ్రికి ఆరోగ్యం సరిగాలేకపోతే… స్వగ్రామానికి వచ్చింది. బాలికను అదే గ్రామానికి చెందిన శంకర్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో వేధించడం మొదలుపెట్టాడు.
మూడు నెలల క్రితం రాత్రి 7.30గంటల సమయంలో నేను పాలప్యాకెట్టు కోసం బయటకు రాగానే మధు, యువరాజ్తో వచ్చిన శంకర్ నన్ను సైకిల్మోటార్పై బలవంతంగా ఆదోనికి తీసుకొచ్చాడు. ఓ ఇంట్లో బంధించి బలవంతంగా పెళ్లిచేసుకున్నాడు. నాకు హెచ్ఐవీ ఉందని చెప్పినా వినలేదని బాలిక ఆవేదన వ్యక్తం చేసింది.
నా జీవితాన్ని సర్వ నాశనం చేసిన శంకర్, మధు, యువరాజ్, బంధువు ఆంజనేయపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని బాలిక డిమాండ్ చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.