- Advertisement -
తిరుమల కొండ భక్తులతో నిండిపోయింది. దీంతో తిరుమల కొండ భక్తుల కొండగా మారింది. వాతావరణంలో వచ్చిన మార్పులు, వేసవి సెలవులు, పరీక్షా ఫలితాల విడుదల వంటి కారణాలతో భక్తులు తిరుమలకు విశేష సంఖ్యలో వస్తున్నారు. దీంతో శ్రీవారి దర్శనానికి గంటల కొద్ది సమయం పడుతోంది.
క్యూ లైన్ల కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోతున్నాయి. కలియుగ దైవం దర్శనానికి దాదాపు 12 గంటల సమయం పడుతోంది. నడకదారిన వచ్చే భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. కొండపై భక్తులకు గదులు దొరకక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంతే కాదు.. తలనీలాలు సమర్పించుకునే కల్యాణ కట్ట కూడా భక్తులతో కిటకిటలాడుతోంది.