Monday, May 20, 2024
- Advertisement -

స్మార్ట్ ఫోన్‌లు,కంప్యూట‌ర్లు ఇప్పుడే కొనండి … బ‌డ్జెట్ త‌ర్వాత వాటి ధ‌ర‌ల‌కు రెక్క‌లు

- Advertisement -

స్మార్ట్ ఫోన్‌లు. ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాలు కొనాలంనుకుంటున్నారా…? అయితే ఇప్పుడే త్వ‌ర‌ప‌డండి..బ‌డ్జెట్ త‌ర్వాత ఉపకరణాల ధరలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనల్లో ప్రస్తుతం ఎటువంటి పన్నులూ లేని పీసీబీ (ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు), కెమెరా మాడ్యూల్స్, డిస్ ప్లే ప్యానల్స్ పై కస్టమ్స్ సుంకాలను విధించవచ్చని తెలుస్తోంది.

సుంకం పెంచితే స్మార్ట్ ఫోన్ల నుంచి ల్యాప్ టాప్ ల వరకూ అన్ని రకాల ఎలక్ట్రానిక్ ఉపకరణాలపైనా ప్రభావం పడుతుంది. జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత కస్టమ్స్ సుంకం మాత్రమే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందన్న సంగతి తెలిసిందే. భారత కంపెనీలు విదేశాల నుంచి విడిభాగాలు తెచ్చి, ఇక్కడ వాటిని క్రమ పద్ధతిలో అమర్చి సెల్ ఫోన్లు వంటి ప్రొడక్టులను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. సుంకాలు లేకుండా వీటి దిగుమతికి అనుమతిస్తున్న కారణంగా, తయారీ రంగం వృద్ధిని సాధించడంలో విఫలమవుతోందన్నది కేంద్రం అభిప్రాయం.

ఇండియాను తయారీ హబ్ గా మార్చాలంటే, కస్టమ్స్ సుంకాలను పెంచాలని భావిస్తోంది. కాగా, గత జూలైలో మొబైల్ ఫోన్ల దిగుమతిపై 10 శాతం సుంకాలు విధించిన కేంద్రం, డిసెంబర్ లో దీనిని 15 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే.దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించడంతో పాటు పెద్ద ఎత్తున ఇండియాలో పరిశ్రమలను స్థాపించే వారికి ప్రోత్సాహకాలను కూడ ప్రభుత్వం కల్పిస్తోంది.ఈ కారణంగా ఇతర దేశాల నుండి వస్తువులను దిగుమతి చేసుకొంటే కస్టమ్స్ డ్యూటీని పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది

కేంద్ర ప్రభుత్వం 2018 బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వా స్మార్ట్‌పోన్ ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బడ్జెట్ తర్వాత స్మార్ట్‌పోన్, ఎలక్ట్రానిక్ పరికరాల ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాలపై కస్టమ్స్ డ్యూటీ వేయాలని ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -