బడ్జెట్ సమావేశాలు, సంబంధిత అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు సమీక్షించనున్నారు. ఈ భేటీలో బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయ, వ్యయాలను పరిగణనలోకి తీసుకొని 2021-22 సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు.
కరోనా, లాక్డౌన్ తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆర్థిక పరిస్థితులు బాగా దెబ్బతిన్నాయి. ఏప్రిల్, మే నెలల్లో సర్కార్ ఖజానాకు ఆదాయం పూర్తిగా పడిపోగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 57 వేల కోట్ల రూపాయల మేరకు కోల్పోయినట్లు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది.
నాగార్జున సాగర్ ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని తెరాస శ్రేణులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఎర్రవల్లిలోని తన నివాసంలో పార్టీ ఇన్ఛార్జులతో సాగర్ ఉపఎన్నికపై…. సీఎం సమావేశం నిర్వహించారు.
ఒక వైపు ఎన్నికలు.. మరో వైపు బంగారం.. ఎంతో తెలుసా..!