- Advertisement -
ఐఎన్ఎక్స్ మీడియా వ్యవహారంలో తీహార్ జైలులో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంకు ఢిల్లీ హైకోర్టులో మరోసారి నిరాశ ఎదురైంది. తనకు బెయిల్ ఇవ్వాలని చిదంబరం వేసిన పిటిషన్ ను తిరస్కరించింది. బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ వాదనతో ఏకీభవించిన కోర్టు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది.
ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు మాయమయ్యాయని అడిషనల్ సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఢిల్లీ హైకోర్టుకు ఇదివరకే తెలిపిన విషయం తెలిసిందే