Friday, May 17, 2024
- Advertisement -

డీఆర్‌డీఓ నూతన ఛైర్మన్‌గా తెలుగు వ్య‌క్తి స‌తీష్‌రెడ్డి నియామ‌కం…

- Advertisement -

రక్షణ శాఖలో కీలకమైన రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ఛైర్మన్‌గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన డా. సతీశ్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం, రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారు హోదాలో ఆయన ఉన్నారు.

నెల్లూరు జిల్లాకు చెందిన సతీశ్ రెడ్డి అనంతపురంలో బీటెక్, జేఎన్టీయూ హెచ్ లో ఎంఎస్ పూర్తి చేశారు. 1985లో డీఆర్డీవోలో చేరారు. నావిగేషన్, ఏవియానిక్స్ టెక్నాలజీ రంగాల్లో విశేష పరిశోధనలు చేశారు. మనోహర్ పారికర్ రక్షణ మంత్రిగా ఉన్న సమయంలో సలహాదారుగా నియమితులయ్యారు. అంత‌కు ముందు హైదరాబాద్ డీఆర్డీవోలోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ కు సతీశ్ రెడ్డి డైరెక్టర్ గా పనిచేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -