అలందా మీడియా కేసులో ఆరోపనలు ఎదుర్కొంటున్న గరుడ పురాణం శివాజీకి దుబాయ్ ఎయిర్ పోర్ట్లో ఇమ్మిగ్రేషన్ అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. శివాజీ దుబాయ్ మీదుగా అమెరికా వెళ్లాలని ప్రయత్నించగా, అక్కడి అధికారులు అడ్డుకున్నారు. తిరిగి హైదరాబాద్ వెళ్లిపోవాలని సూచించారు. శివాజీపై ఎలాంటి ప్రయాణ ఆంక్షలు లేవని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. అయితే శివాజీని దుబాయ్ ఎయిర్ పోర్టులో ఎందుకు నిలిపివేశారో తెలియదన్నారు.
శివాజీని గతంలో హైదరాబాద్ ఎయిర్పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు పట్టుకున్నారు. డిఫరెంట్ గెటప్లో విమానాశ్రయానికి వచ్చిన శివాజీని.. అధికారులు పాస్ పోర్టు చూసి గుర్తించారు. అప్పటికే ఆయన మీద అలంద మీడియా కేసు నడుస్తోంది. దీంతో ఎయిర్ పోర్టు అధికారులు సైబరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై పూర్తి వివరాలు తెలుసుకొనేందుకు ప్రయత్నం చేస్తున్నామని సజ్జనార్ తెలిపారు.