Saturday, May 25, 2024
- Advertisement -

క‌థ‌నాల‌పై రెండురోజుల్లోగా వివర‌న ఇవ్వాల‌ని ఈసీ ఆదేశం

- Advertisement -

టీడిపీఆస్థాన ప‌త్రిక‌కు నంద్యాల‌లో భారీ షాక్ త‌గిలింది. నంద్యాల ఓటర్లను ప్రభావితం చేసే విధంగా అభ్యంతరకర వ్యాఖ్యలతో ఈ నెల 7న కర్నూలు జిల్లా టాబ్లాయిడ్‌లో క‌థ‌నాన్ని ప్రచురించింది. దీనికి వివిర‌న ఇవ్వాల‌ని జిల్లా ఎన్నిక‌ల అధికారి,క‌లెక్ట‌ర్ ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌కు నోటీస‌లను జారీ చేసింది.

నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ప్రచురించిన ఈ కథనంపై వైసీపీ శ్రేణులు ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ అయిన సత్యనారాయణకు ఫిర్యాదు చేశాయి. మరోవైపు, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను విరుద్ధంగా ఈ కథనం ఉన్నట్టు మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ నిర్ధారించింది.

నేపథ్యంలో ఆంధ్రజ్యోతి కథనం ప్రజాప్రాతినిధ్య చట్టం ఆర్పీ యాక్ట్ సెక్షన్ 127ను ఉల్లంఘించడమే అవుతుందంటూ జిల్లా కలెక్టర్ నోటీసులు పంపించారు. ఈ కథనాన్ని పెయిడ్ న్యూస్ గానే భావిస్తున్నట్టు నోటీసులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -