బల్లీ పురపాలక సంఘంలో ఇంజనీరుగా పనిచేస్తున్న ప్రణబ్ అధికారిని(50) ఏసిబి అధికారులు (అనిశా టీం) అరెస్ట్ చేశారు.
అతడి నివాసంలో సోదాలు నిర్వహించి రూ.24కోట్ల రూపాయల నగదు, పదనాలుగు లక్షల విలువ గల బంగారు ఆభరణాలు, వజ్రాలను అనిశా టీం స్వాధీనం చేసుకున్నారు. ఇంత డబ్బు, నగలు ఈ ఇంజనీర్ ఎక్కడ దాచారో తెలుసా..? ఇంట్లో వాడని బాత్ రూంలో. ప్రణబ్ లంచం అడుగుతున్నాడంటూ స్థానిక బిల్డర్ పోలీసులకు పిర్యాదు చేయడంతో అనిశా టీం అతడి ఇంట్లో సోదాలు నిర్వహించింది.
ఇంట్లో వాడని బాత్ రూంమ్లో నోట్ల కట్టలు దొరికాయని, ఇంకా బాల్కని టైల్స్ పగులగొట్టడంతో అక్కడ కూడా డబ్బులు కట్టలు కట్టలు బయటపడినట్లు అధికారులు చెబుతున్నారు.
సోదాలు నిర్వహిస్తుండగా ఇంజనీరు కుమారుడు ఒక అధికారిపై చేయి చేసుకోవడంతో అతనికి గాయాలయ్యాయి. వెంటనే ఇంజనీరు కుమారుడిని అరెస్ట్ చేశారు. శనివారం వీరిని కోర్టులో హాజరు పరచగా న్యాయముర్తి మూడు రోజుల పాటు పోలీసుల కస్టడీ విధించారు.