Saturday, May 18, 2024
- Advertisement -

రూ. 1,74,453 కోట్లతో 2018-19 తెలంగాణా బ‌డ్జెట్‌

- Advertisement -

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతి ఏటా ప్రవేశపెడుతున్న బడ్జెట్లు ప్రగతికి ప్రతిరూపంగా నిలుస్తున్నాయి. ప్రణాళికేతర వ్యయాన్ని నియంత్రించుకుంటూ ప్రణాళిక పద్దును పెంచుకుంటూ ప్రభుత్వం సత్తా చాటుతున్నది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. గత రెండేళ్లలో గణనీయమైన అభివృద్ధిని సాధించామని చెప్పారు. నూతన పారిశ్రామిక విధానాలను తీసుకొచ్చామని తెలిపారు. సంక్షేమ రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద పీట వేశారని చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.

బడ్జెట్ హైలైట్స్…
బడ్జెట్ – రూ. 1,74,453 కోట్లు
రెవెన్యూ వ్యయం – రూ. 1,25,454 కోట్లు
రాష్ట్ర ఆదాయం – రూ. 73,451 కోట్లు
కేంద్ర వాటా – రూ. 29,041 కోట్లు
రెవెన్యూ మిగులు – రూ. 5,520 కోట్లు
ద్రవ్యలోటు అంచనా – రూ. 29,077 కోట్లు

గత ఏడాది తలసరి ఆదాయం అంచనా – రూ. 1,75,534 కోట్లు
ఈ ఏడాది రాష్ట్ర జీడీపీ వృద్ధి అంచనా – 10.4 శాతం
సాగునీటి ప్రాజెక్టులకు – రూ. 25 వేల కోట్లు
కోల్డ్ స్టోరేజీ, లింకేజీలకు – రూ. 132 కోట్లు
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు – రూ. 1000 కోట్లు
ఆసరా పెన్షన్లకు – రూ. 5300 కోట్లు
ఆరోగ్య లక్ష్మి పథకానికి – రూ. 298 కోట్లు
హహిళా, శిశు సంక్షేమానికి – రూ. 1,799 కోట్లు
ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధికి – రూ. 9,693 కోట్లు
ఎస్సీ అభివృద్ధి శాఖకు – రూ. 12,709 కోట్లు
ఎస్టీల అభివృద్ధి శాఖకు – రూ. 8,063 కోట్లు
దళితుల భూ పంపిణీకి – రూ. 1,469 కోట్లు
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు – రూ. 2,643 కోట్లు
మైనార్టీల సంక్షేమానికి – రూ. 2వేల కోట్లు
అమ్మ బడి పథకానికి – రూ. 561 కోట్లు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు – రూ. 15,563 కోట్లు

వరంగల్ నగర అభివృద్ధికి – రూ. 300 కోట్లు
పట్టణాభివృద్ధికి – రూ. 7,251 కోట్లు
రోడ్లు భవనాల శాఖకు – రూ. 5,575 కోట్లు
పంట పెట్టుబడి పథకానికి – రూ. 12వేల కోట్లు
రైతు బీమా పథకానికి – రూ. 500 కోట్లు
వ్యవసాయం, మార్కెటింగ్ కు – రూ. 15,780 కోట్లు
పాలీ హౌస్, గ్రీన్ హౌస్ కు – రూ. 120 కోట్లు
సాగునీటి ప్రాజెక్ట్ లకు – రూ. 25వేల కోట్లు
పరిశ్రమలు, వాణిజ్య శాఖకు – రూ. 1,286 కోట్లు
ఐటీ శాఖకు – రూ. 289 కోట్లు
చేనేత, టెక్స్ టైల్ రంగానికి – రూ. 1,200 కోట్లు
ఆరోగ్యలక్ష్మి పథకానికి – రూ. 298 కోట్లు
మిషన్ భగీరథకు – రూ. 1,801 కోట్లు
మిషన్ కాకతీయకు – రూ. 25వేల కోట్లు
సాంస్కృతిక శాఖకు – రూ. 2వేల కోట్లు
యాదాద్రి అభివృద్ధికి – రూ. 250 కోట్లు
వేములవాడ దేవాలయం అభివృద్ధికి – రూ. 100 కోట్లు
బాసర ఆలయ అభివృద్ధికి – రూ. 50 కోట్లు
ధర్మపురి ఆలయ అభివృద్ధికి – రూ. 50 కోట్లు
భద్రాచలం ఆలయ అభివృద్ధికి – రూ. 100 కోట్లు
అర్చకుల జీతభత్యాలకు – రూ. 72 కోట్లు
హోంశాఖకు – రూ. 5,790 కోట్లు
పౌరసరఫరాల రంగానికి – రూ. 2,946 కోట్లు
విద్యుత్ రంగానికి – రూ. 5,650 కోట్లు
వైద్య ఆరోగ్యశాఖకు – రూ. 7,375 కోట్లు
విద్యాశాఖకు – రూ. 10,830 కోట్లు
గురుకులాలకు – రూ. 2,823 కోట్లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -