Friday, April 19, 2024
- Advertisement -

క‌న్న బిడ్డ‌ల‌ను అతి కిరాత‌కంగా చంపిన క‌సాయి తండ్రి..

- Advertisement -

కంటికి రెప్ప‌లా కాపాడాల్సిన తండ్రి తాగుడుకు బానిస అయి పిల్ల‌ల‌పాలిట కాల‌య‌ముడ‌య్యాడు. భార్య‌మీద కోపంతో క‌న్న‌బిడ్డ‌ల‌ను అతి కిరాత‌కంగా హ‌త‌మార్చాడు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఈ దారున ఘటన చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెల్తే….రామచంద్రాపురం బొంబై కాలనీలో భార్యభర్తలు నివసిస్తున్నారు. వారికి ముగ్గురు పిల్ల‌లు ఉన్నారు. మద్యానికి బానిసై… తరచూ భార్యతో గొడవలు పడ్డాడు దీంతో ఆమె మనస్తాపానికి గురై నెలరోజుల క్రితమే పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో భార్య‌పై పెంచుకున్న కోపం బిడ్డ‌ల‌పై చూపాడు.

భార్య‌మీద ఉన్న కోపాన్ని ఆపుకోలేక ముగ్గురు పిల్లల్ని కసితీరా చంపేశాడు. కొడుకును, కూతుర్ని అర్థరాత్రి ఉరేసి చంపేశాడు. మరో కుమార్తెపై కత్తితో దాడికి ప్రయత్నించాడు. దీంతో ఆమెకు తీవ్రగాయలై ప్రాణాపాయ స్థితికి చేరుకుంది.మృతిచెందినవాళ్లు ఏడేళ్ల అఖిల్, నాలుగేళ్ల శరణ్యగా గుర్తించారు. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తాగుడుకు బానిసై ఏడేళ్ల అఖిల్, నాలుగేళ్ల చిన్నకుమార్తె శరణ్యను కత్తితో దారుణంగా పొడిచి తాడుతో ఉరేశాడు. దీంతో వారిద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరోవైపు పెద్ద కూతురు మల్లేశ్వరిపై కూడా కత్తితో దాడికి యత్నించిన తండ్రిని తెలివిగా మాటల్లో పెట్టి తప్పించుకుంది. ఈ దాడిలో ఆమె మెడకు స్వల్ప గాయాలవ్వడంతో మ‌ల్లేశ్వ‌రిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -