గత కొన్ని రోజులుగా కత్తి మహేష్కు ….పవన్ అభిమానులకు చెలరేగిన విషయం అందరికి తెలిసిందే. అది ముగియక ముందె రోజాపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా కామెడీషో ‘జబర్దస్త్ షోలో తమను హేళన చేస్తూ, కించపరుస్తూ నటుడు హైపర్ ఆది డైలాగులు పలికాడంటూ ఈ రోజు అనాథ బాలికలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఓచానల్కు ఇచ్చిన ఇంటర్వూలో కత్తి మహేష్ మాట్లాడుతూ జబర్దస్త్ నటులు, జడ్జిల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నటులనే కాకుండా జడ్జిలు రోజా, నాగబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల క్రితం వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ తాను ‘జబర్దస్త్’ వల్లే ఎమ్మెల్యేని అయ్యానని చెప్పుకోవడం సిగ్గు చేటని మహేశ్ కత్తి తెలిపారు. ఓటు వేసిన నగరి ప్రజలు ఏమయ్యారని, సీటు ఇచ్చిన పార్టీ ఏమయిందని ప్రశ్నించారు.
హైపర్ ఆదిలాంటి వారు ఇలా అనాధలపై వికృత వ్యాఖ్యలు చేస్తోంటే ఖండించాల్సింది పోయి, బిగ్గరగా నవ్వుతూ రోజా ఎంజాయ్ చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధిగా రోజా ఎంత దిగజారి ఉందో ఆ నవ్వు చూస్తుంటేనే తెలుస్తోందని వ్యాఖ్యానించారు. ఈ షోలో వేసే వికృత డైలాగులకు జడ్జిలు ఇలా వెటకారంగా నవ్వుతోంటే ఎలా స్పందించాలో కూడా తనకు అర్థం కావడం లేదని అన్నారు.