Sunday, April 28, 2024
- Advertisement -

ఆదివాసీ హాస్ట‌ల్లో గ‌ర్భం దాల్చిన న‌లుగురు విద్యార్థినులు…

- Advertisement -

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ లో ఉన్న ఆదివాసీ హాస్ట‌ల్లో దారున సంఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లకు చెందిన నలుగురు విద్యార్థినులు గర్భం దాల్చారు. వేసవి సెలవుల అనంతరం విద్యార్థినులు తిరిగి ఆదివారం హాస్టళ్లకు చేరుకున్నారు. అమ్మాయిలకు వైద్య పరీక్షల తరువాత విషయం తేలగా, శిశు సంక్షేమ కమిటీ ప్రతినిధులు భువనేశ్వర్‌ పోలీసు కమిషనర్‌ సత్యజిత్‌ మహంతికి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫిర్యాదుపై స్పందించిన సత్యజిత్, ఆరోగ్య పరీక్షల నివేదికను పరిశీలిస్తున్నామని, వారికి మరోసారి ఇవే పరీక్షలు చేసి ఏం చేయాలన్న విషయమై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -