తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నందమూరి ఫ్యామిలీకి మరో షాక్ ఇచ్చారు. ఇప్పటికే నందమూరి ఫ్యామిలీకి చెందన సుహాసినిని కూకట్పల్లి నియోజికవర్గంలో ఘోరంగా ఓడించిన సంగతి తెలిసిందే. కూకట్పల్లిలో ఆంధ్రకు చెందిన ప్రజలు ఎక్కువుగా ఉంటారు. దీనిని ఉద్దేశంలో పెట్టుకుని నందమూరి సుహాసినికి కూకట్పల్లి టికెట్ కేటాయించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ సీటును ప్రతీష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్, అక్కడ గెలిచి చంద్రబాబుతో పాటు , నందమూరి ఫ్యామిలీకి షాకిచ్చారు.
ఇప్పుడు మరోసారి నందమూరి ఫ్యామిలీని టార్గెట్ చేసుకున్నట్లు అనిపిస్తోంది కేసీఆర్. సినీ నటుడు నందమూరి తారకరత్నకు చెందిన ఓ కబరా డ్రైవ్ ఇన్ రెస్టారెంటును ను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో తారకరత్న నిర్వహిస్తున్న కబరా డ్రైవ్ ఇన్ రెస్టారెంటును అధికారులు కూల్చివేశారు. విషయం తెలుసుకున్న తారకరత్న హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. అధికారులతో ఆయన కూడా వాదనకు దిగారు.అయితే సొసైటీ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాము కబరా డ్రైవ్ ఇన్ రెస్టారెంటును కూల్చివేశామని అధికారులు తెలిపారు. అర్థరాత్రి వేళా మద్యం అమ్మకాలతో పాటు పెద్ద శబ్దాలతో న్యూసెన్స్ చేస్తున్నారంటూ అక్కడి స్థానికులు ఫిర్యాదు ఇచ్చినట్లు తెలుస్తోంది.
- Advertisement -
నందమూరి కుటుంబానికి మరో షాకిచ్చిన కేసీఆర్
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -