Sunday, April 28, 2024
- Advertisement -

స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు….

- Advertisement -

స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్‌ తగ్గడంతో బంగారం ధర తగ్గింది. నేటి మార్కెట్‌లో పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.115 తగ్గి రూ.32,285కు చేరింది. అదే బాటలో వెండి ధర కూడా పడిపోయింది. కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ.41,300గా ఉంది.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధర పెరిగింది. సింగపూర్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.20 శాతం అధికమై, 1320.50 డాలర్లకు చేరింది. భారత్‌లో స్థానిక బంగారు వ్యాపారుల నుంచి డిమాండ్‌ తగ్గడంతో పసిడి ధర తగ్గిందని విశ్లేషకులు చెబుతున్నారు.

నాణేల తయారీదారులు, పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్‌ తగ్గడంతో వెండి ధర కూడా తగ్గింది. కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ.41,300గా నమోదైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -