Thursday, April 25, 2024
- Advertisement -

భారీ వేగంతో వెనక్కి వెళ్ళిన గూడ్స్​రైలు..!

- Advertisement -

ఒడిశాలో ఓ గూడ్స్​రైలు అదుపుతప్పి సుమారు 24 కిలోమీటర్లు వెనక్కి వెళ్లింది. సుందర్​గఢ్​ జిల్లా బిమల్​గఢ్​ జంక్షన్​లో జరిగిన ఈ ఘటనలో ఓ రైల్వే ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డారు.ఇనుప ఖనిజాల లోడుతో ఓ గూడ్స్​ రైలు.. మంగళవారం సాయంత్రం 7 గంటలకు బరాసున నుంచి రూర్కెలాకు బయల్దేరింది.

కొంత దూరం వెళ్లాక ఒక్కసారిగా అదుపుతప్పి 24 కిలోమీటర్లు వెనక్కి దూసుకెళ్లింది. అప్రమత్తమైన లోకోపైలట్​ బ్రేకులు వేయగా.. నాలుగు బోగీలు పట్టాలు తప్పి ఒకదానిపై మరొకటి ఎక్కాయి. బిమల్​గఢ్​ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న రైల్వే ఉద్యోగి ఎన్​కే ఛటర్జీకి తీవ్రంగా గాయాలయ్యాయి.

రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -