Friday, May 17, 2024
- Advertisement -

బాల‌య్య‌కు షాక్‌.. నోటీసులు ఇచ్చిన హైకోర్టు

- Advertisement -

న‌టుడు, టీడీపీ ఎంపీ బాల‌కృష్ణకు హైకోర్టు ఝ‌ల‌క్ ఇచ్చింది.బాలయ్య ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని దాఖలైన పిటీషన్ పై బాలయ్యకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నంద్యాల ఉప ఎన్నికల్లో బాల‌య్య ఓ బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడుతు ..ఓటర్లకు బహిరంగంగా డబ్బు పంపిణీ చేశారంటు వైసీపీ నేత శివకుమార్ ఉమ్మడి హైకోర్టులో ప‌టిషిన్ దాఖ‌లు చేశారు.

దీనిపై విచార‌ణ చేప‌ట్టిన ధర్మాసనం బాలకృష్ణకు నోటీసుల అంశంపై ఆరా తీసింది. కేంద్ర ఎన్నికల కమిషన్ కు, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి, కర్నూలు జాయింట్ కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘించిన బాల‌య్య‌పై కేసు న‌మోదు చేయ‌ల‌ని ఎన్నికల సంఘ‌న్ని ఆదేశించింది. బాలకృష్ణకు వ్యక్తిగతంగా నోటీసులు అందజేయాలని తెలిపింది. ఈ కేసు విచార‌ణ‌ను మ‌రో నాలుగు వారలపాటు వాయిదా వేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -