- Advertisement -
పెద్దలను ఎదురించి ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిపై దాడులు ఆగడంలేదు. పరువు కోసం కన్న బిడ్డలు అని చూడకుండా తల్లి,దండ్రులు నిర్దాక్ష్యంగా చంపుతున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో మరో పరువు హత్య కలకలం రేపుతోంది. కులాంతర వివాహం చేసుకుందన్న పోపంతో ఊగిపోయిన తండ్రి కూతురు అని చూడకుండా గొంతు నులిమి చంపాడు ఓ తండ్రి.
వివరాల్లోకి వెల్తే….ప్రకాశం తాళ్లూరు మండలం కొత్తపాలెంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది.ఒంగోలులో డిగ్రీ చదువుతున్న కోట వైష్ణవి..వేరే కులం అబ్బాయిని ప్రేమించింది. తల్లి,దండ్రులకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుంది. ఇష్టంలేని పెళ్లి చేసుకోవడంతో ఆవేశంతో ఊగిపోయిన తండ్రి గొంతు నులిమి చంపినట్లు తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.