తమిళనాడులో పరువు హత్య కలకలం రేపింది. మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ పరువు హత్య వంటి సంగటనే చోటు చేసుకుంది. అయితే అక్కడ .. ఇక్కడ ప్రియుడితోపాటు.. ప్రియురాలు కూడా ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెల్తే… తిరునల్వేలి జిల్లా కేంద్ర సహకార సంఘ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఇసక్కి శంకర్, వెల్లంగుళి ప్రాంతానికి చెందిన తలవాయ్ కుమార్తె మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ పెళ్లికి శంకర్ తల్లిదండ్రులు అనుమతించగా, ఆమె కుటుంబీకులు మాత్రం అంగీకరించలేదు.
ఈ క్రమంలో సోమవారం ఉదయం స్నానానికి చెరవు వద్దకు వెళ్లిన శంకర్ ని.. యువతి తండ్రి డబ్బు ఇచ్చి మరీ ఓ ముఠాతో హత్య చేయించాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి.. మనస్థాపానికి గురై ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హత్యను శంకర్ ప్రియురాలి తండ్రే చేయించాడన్న ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.