ఫుల్ గా తాగాక ఎవరు ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు. మందు కూడా ఒక డ్రగ్ లోకే వస్తుంది కాబట్టి…. ఆ టైమ్లో తాగుబోతులు ఏమేం చేస్తున్నారో మర్చిపోతున్నారు. రీసెంట్ గా అలాంటి ఇన్సిడెంటే ఒకటి జరిగింది.
కుకట్ పల్లిలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యతో కేవలం చీపు చికెన్ కోసం గొడవపడి….. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసులు చెబుతున్న దాని ప్రకారం.. కూకట్ పల్లి రామకృష్ణానగర్లో నివాసం ఉండే ఓ టాక్సీ డ్రైవర్ మధు …. ఆదివారం నాడు బాహుబలి సినిమాకు వెళ్లి ఇంటికి తిరిగొచ్చాడు. వచ్చాక తనకు ఆహారంగా చికెన్ కావాలని భార్యను కోరాడు.అయితే ఆమె దగ్గర చికెన్ కు సరిపడా డబ్బులు లేకపోవడంతో తేలేనని చెప్పడంతో గొడవైంది. ఆతరువాత ఇంటిలో దాచుకున్న డబ్బులను బయటకు తీసి మొగుడు బాధ భరించలేక చికెన్ తేవడం కోసం ఇంటికి
వెళ్లింది. ఆమె చికెన్ తెచ్చే లోపు ఏమనుకున్నాడో ఏమో…. ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయాడని అతని బార్య చెబుతుంది. స్థానికుల సాయంతో బార్య తన భర్త మదును ఆస్పత్రికి తీసుకు వెళ్లినప్పటికీ లాభం లేకుండా పోయింది.
మరీ టూ మచ్ కాకపోతే ఎంత చికెన్ కూర వండకపోతే మాత్రం ఇలా చనిపోవడమనే కాన్సెప్ట్ స్థానికంగా లేనిపోని అనుమానాలకు తావిస్తుంది.