- Advertisement -
ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ ప్రియులకి పండగే , మొన్నటి వరకూ ధర్మశాల లో జరగాల్సి ఉన్న ఈ మ్యాచ్ ఇప్పుడు కోలకతా ఈడెన్ గార్డెన్స్ కి షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయం లో మరొక గందరగోళం మొదలు అయ్యింది. ఈ మ్యాచ్ ని ఏ టీ ఎఫ్ ఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
పాకిస్తాన్ ఆటగాళ్ళు ఈడెన్ లో క్రికెట్ ఆడితే అమరవీరులకి అవమానం అనేది ఈ సంస్థ ఉద్దేశ్యం.ఈ సంస్థ అధ్యక్షుడు అయిన వీరేశ్ ఈ విషయం లో పెద్ద వార్నింగ్ కూడా ఇచ్చాడు.
ఈడెన్ లో మ్యాచ్ జరగాలని గట్టి నిర్ణయం తీసుకుంటే భారీ నిరసన ప్రదర్సనలు నిర్వహిస్తాం అని వారు వార్నింగ్ ఇచ్చారు. పాక్ క్రికెట్ ఆడాల్సిన పిచ్ ని తవ్వి పారేస్తాం అనీ ఎంత మంది పోలీస్ బృందం పెట్టినా తమని అడ్డుకోలేరు అన్నారు వారు.