- Advertisement -
తెలంగాణకు మరో తిరుమల మాదిరిగా యాదాద్రిని మారుస్తామని తెలంగాణ ప్రభుత్వం పట్టుదలతో ఉంది. అందుకనుగుణంగా ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బాలాలయంలో లక్ష్మీనారసింహుడు భక్తులకు దర్శనమిస్తున్నారు. నిత్య పూజలు యథావిధిగా కొనసాగుతున్నాయి. అయితే దర్శనం అనంతరం ప్రసాదం తీసుకుని తింటుంటే జాగ్రత్తగా గమనించి తినండే.. ఎందుకంటే అందులో మేకులు ఉండే పరిస్థితి.
ప్రసాద విక్రయశాలలో తీసుకున్న పులిహారలో ఇనుప ముక్కలు కనిపించాయి. భక్తులకు విక్రయించిన పులిహోరలో ఇనుప ముక్కలు రావడంతో భక్తుడు షాక్కు గురయ్యాడు. వెంటనే ఆలయ అధికారులకు ఫిర్యాదు చేయడంతో స్పందించిన అధికారులు పులిహోర ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై స్పందించిన ఈఓ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.