Tuesday, May 7, 2024
- Advertisement -

ప్లాగారిజం పై రియాక్ట్ అయిన పూరి

- Advertisement -

గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమైన డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఎట్టకేలకు ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. రామ్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రస్తుతం బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలైన కొన్ని రోజులకే ప్లాగారిజం వివాదాల్లో చిక్కుకుంది. కోలీవుడ్ నటుడు ఆకాష్ ఈ సినిమా కథ తనదేనంటూ ప్రెస్ మీట్ పెట్టి తెలియజేశారు. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా కథ తాను హీరోగా నటించిన తమిళ సినిమా ‘నాన్ యార్’ కథ ఒకటేనని, ఒకవేళ పూరి జగన్నాధ్ ఈ విషయంలో రియాక్ట్ అవ్వక పోతే తాను లీగల్ గా ప్రొసీడ్ అవుతానని ఆకాష్ ఆరోపించాడు.

ఈ నేపథ్యంలో మొన్నటి దాకా సైలెంట్ గా ఉన్న పూరి జగన్నాథ్ తాజాగా మౌనం వీడారు. ఈ విషయంపై స్పందిస్తూ “ఇస్మార్ట్ శంకర్’ పూర్తిగా నా కథ. నేను ఎక్కడ నుంచి కాపీ కొట్టి రాయలేదు. ఆకాష్ నన్ను ఇప్పటిదాకా కలవలేదు దీని గురించి మాట్లాడనూ లేదు. ఈ మధ్యనే నేను ఈ విషయాన్ని మీడియా లో చూశాను. ప్రస్తుతానికి అయితే నేను ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా సక్సెస్ ని ఆస్వాదిస్తున్నాను.” అంటూ క్లారిటీ ఇచ్చాడు పూరి జగన్నాథ్. మరి ఈ విషయంలో ఆకాష్ ఎలా స్పందిస్తాడు అనేది తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -