తెలుగు సినీ పరిశ్రమను కలవరపెడుతున్న డ్రగ్స్ రాకెట్ కేసులో రోజు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికె సిట్ నోటీసులను పంపిన సెలబ్రిటీలను విచారన సాగిస్తున్నారు. ఛార్మీ విచారన పూర్తయిన నేపథ్యలో ఇప్పుడ ముమైత్ఖాన్ వంతు వచ్చింది.
అయితే ఇప్పుడు మరో కీలక పరినామం చోటు చేసుకుంది. సిట్ అధికారులు గురువారం సినీ నటి మొమైత్ఖాన్ను ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. ఆమె గురువారం సిట్ విచారణకు హాజరుకానుందని తెలుస్తోంది. ఉదయం 10 గంటలకు ఆమె విచారణకు హాజరుకానున్నారు.
ప్రస్తుతం మొమైత్ఖాన్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్గా చేస్తున్న ప్రముఖ షో బిగ్బాస్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ షో నిబంధనల ప్రకారం ఆమె అర్ధంతరంగా బిగ్బాస్ హౌస్ నుంచి బయటకు రావడానికి వీల్లేదని అంటున్నారు. బిగ్బాస్లో భాగంగా పుణెలోని ఓ భవనంలో మిగతా పార్టిస్పెంట్స్తో కలిసి ఆమె నివసిస్తున్నారు.
నేపథ్యంలో మొమైత్ విచారణకు వస్తారా? రారా? అన్నది ఇన్నాళ్లు ఉత్కంఠ రేపింది. ఇప్పుడు ఆమె విచారణకు రానున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెను బిగ్బాస్ షో నుంచి తప్పించారా? లేకుంటే సిట్ విచారణ నేపథ్యంలో ఒకరోజు మినహాయింపు తీసుకొని.. తిరిగి బిగ్బాస్లో పాల్గొననున్నారా? ఈ మేరకు బిగ్బాస్ షో నిబంధనలు ఏమైనా మారుస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. అయితె విశ్వనీయ వర్గాల సమాచారం ప్రకారం ముమైత్ఖాన్ను బిగ్బాస్షోనుంచి బయటకు పంపించారనే తెలుస్తోంది.
- Advertisement -
డ్రగ్స్ కేస్ ముమైత్ కొంప ముంచిందా..
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -