తన పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీ లోకి వెళ్ళకుండా ఆపడమే జగన్ మోహన్ రెడ్డి మెయిన్ అజెండా అయితే ఆయన ఇదే ప్రయత్నం ఎన్నో సార్లు చేసినప్పటికీ కూడా ఆ ప్రయత్నం విఫలం అవుతూనే ఒచ్చింది. ఇప్పుడు ఇదంతా ఆలోచించిన వైకపా నాయకుడు ఒక కొత్త రూటు లోకి వెళ్లారు.
పార్టీ ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యే లకి షాక్ ఇవ్వడం కోసం తమ పార్టీ గుర్తు మీద గెలిచి ఈ రకంగా ఆఫర్ల కోసం లొంగిపోయారు అంటూ నేరుగా ప్రజలలోకి వెళ్లి ప్రచారం చెయ్యాలి అని జగన్ చూస్తున్నారు. ప్రస్తుతం ఎవరైతే ఎమ్మెల్యే లు జంప్ అయ్యారో వారిని టార్గెట్ గా చేసి వారి వారి నియోజికవర్గాల్లో తమ కార్యకర్తలతో ధర్నాలు నిరవహిస్తాం అంటున్నారు జగన్ మోహన్ రెడ్డి.
గతం లో జగన్ చేసిన ధర్నాలకి సరైన స్పందన కనిపించింది. దీంతో ‘ మహా ధర్నా’ లు చేపట్టాలని ఆ పార్టీ భావిస్తోంది. అదే సమయం లో ఆయా నియోజికవర్గాల్లో ఎప్పటినుంచో పెరబెట్టుకుని ఉన్న స్మయస్యలను ఎత్తి చూపిస్తూ, ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎలా కాలదన్నారో చెప్పబోతున్నారు. ఈ ప్లాన్ బాగా వర్క్ అవుతుంది అంటున్నారు విశ్లేషకులు కూడా.