Monday, April 29, 2024
- Advertisement -

చైనా పై జపాన్ అసంతృప్తి..!

- Advertisement -

తూర్పు చైనా సముద్రంలోని ద్వీపాల విషయంలో చైనాపై అసంతృప్తి వ్యక్తం చేసింది జపాన్​. ఈ మేరకు.. చైనా విదేశాంగ మంత్రి జపాన్​ పర్యటనలో భాగంగా ఈ విషయాన్ని లేవనెత్తింది.
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ రెండు రోజుల పాటు జపాన్​లో​ పర్యటించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాలు దుందుడుకు చర్యలను నివారించాలని నిర్ణయించుకున్నాయి.

ఇటీవలి కాలంలో చైనా-జపాన్​ల మధ్య చాలా మేరకు ఒప్పందాలు కుదిరాయి. కానీ, ప్రాదేశీక భూభాగాల విషయంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే.. విదేశాంగ మంత్రుల సమావేశంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చించారు.

వ్యాపార సంబంధాల్లోనూ పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు.జపాన్​ అధీనంలో ఉన్న తూర్పు చైనా సముద్ర ద్వీప ప్రాంతాన్ని సెంకాకు అంటారు. దీన్ని చైనా డియోయు అని పిలుస్తుంది. అయితే ఈ ప్రాంతంలో చైనా తమ కోస్ట్​ గార్డ్ నౌకలతో వివిధ కార్యకలాపాలు నిర్వహించింది. జపాన్​ అధికారులు ఈ విషయంపై పలుమార్లు హెచ్చరించినా చైనా ఈ చర్యకు పాల్పడడం గమనార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -