ఎర్రవెల్లి లోని తన ఫార్మ్ హౌస్ లో కెసిఆర్ ఎక్కువగా ఉంటారు అనే విషయం అందరికీ తెలిసిందే. ఎక్కడ ఉన్నా కూడా తనని కలవడానికి వచ్చిన వారిని కలవడం లేదు కెసిఆర్. అలా కలవడానికి ఆయన అసలు ఇష్టపడడం లేదు అంటున్నారు. కొద్ది కాలం గా చాలా మంది నేతలకి ఈ విషయం లో చుక్క ఎదురు అవుతోంది. కెసిఆర్ అసలు నిజంగా బిజీ గా ఉన్నారా లేక తనని కలవడం ఇష్టం లేక అలా చెప్పిస్తున్నారా అని ఎవరిలో వారు మదన పడుతున్నారు.
ఈ మధ్యన ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక టైం లో తెరాస అభ్యర్ధి ఎవరినీ పోటీకి పెట్టద్దు అంటూ దివంగత ఎమ్మెల్యే రాం రెడ్డి వెంకట రెడ్డి భార్య సుచరితా రెడ్డి తో పాటు తెలంగాణా కాంగ్రెస్ చీఫ్ లు కెసిఆర్ ని అపాయింట్ మెంట్ కోరగా అయన కుదరదు పోమ్మర్న్నారు. దీని మీద ఇప్పుడు కాంగ్రెస్ సీరియస్ గా ఉంది. రీసెంట్ గా ప్రజాకవి గూడ అంజయ్య ని కూడా కలవను పొమ్మన్నారు కెసిఆర్.
అంజయ్య ఆరోగ్యం బాలేక ఈ మధ్యనే నిమ్స్ లో చనిపోయారు. ఆయనకి ఆరోగ్యం విషయం లో జాగ్రత్తలు తీసుకోవాలి అని తన కి చేతనైన సహాయం చేసారు కానీ సొంతంగా వెళ్లి కలవలేదు కెసిఆర్. రాష్ట్రం లో ఉన్న కొన్ని సమస్యల గురించి మాట్లాడడానికి వెళ్ళిన తెలంగణా మేధావులకి కూడా ఇదే ఇబ్బంది ఎదురు అయ్యింది అని చెబుతున్నారు. కెసిఆర్ ఇలా ప్రవర్తించడం పట్ల అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆయన తీరిక లేకుండా ఉన్నారని టీఆరెస్ వర్గాలు చెబుతుంటే అదేమీ లేదని.. తనకు ఇష్టం లేనివారికి కలిసేందుకు ఆయన ఇష్టపడడం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇలాగే కొనసాగితే ఆయన ప్రజలకు దూరం కావాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.