తెలంగాణా ముఖ్యమంత్రి అయిన కెసిఆర్ అమరావతి కి రావడం రాచ మర్యాదలతో చంద్రబాబు ఆయనకి స్వాగతం పలకడం. మోడీ సాక్షిగా ఇద్దరు ముఖ్యమంత్రులూ ఒకే స్టేజీ మీద కలిసి పాల్గొనడం లాంటివి మనం చూసాం. అమరావతి శంకుస్థాపన పుణ్యమా అని ఈ ఘనకార్యం సాధ్యం అయ్యింది.
అయితే ఆయన చేసిన మర్యాదలు అన్నీ తిరిగి ఇచ్చేసి రుణం తీర్చేసుకోవాలి అనుకుంటున్న కెసిఆర్ బాబు ని చండీ యాగానికి పిలవాలి అనుకుంటున్న సంగతి తెలిసిందే. మొన్న టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ ఇంట్లో వివాహానికి హాజరయ్యేందుకు చంద్రబాబు హైదరాబాద్ వచ్చినప్పుడు ఆహ్వానిస్తారనుకున్నా ఆ రోజు ఇద్దరూ కలుసుకోలేదు.
దీంతో ఇప్పుడు కొత్త ఊహాగానాలు వస్తున్నాయి. ఆదివారం హైదరాబాద్ లో ఎన్టీఆర్ మునిమనమరాలి పెళ్లికి చంద్రబాబు వస్తారని.. అప్పుడు ఆహ్వానం ఇవ్వాలని అనుకుంటున్నారని వినిపిస్తోంది.
అదే సమయంలో ఇంకో వాదనా వినిపిస్తోంది. కేసీఆర్ నేరుగా విజయవాడ వెళ్లి చంద్రబాబును ఆహ్వానిస్తారని కొందరు చెబుతున్నారు. అమరావతి కోసం తన ఇంటికి వచ్చి మరీ పిలిచిన బాబు ని అదే విధంగా తానూ ఇంటికి వెళ్లి పిలవాలి అనేది కెసిఆర్ లెక్క కావచ్చు.