Sunday, May 5, 2024
- Advertisement -

రెండో త‌ర‌గ‌తి విద్యార్థినిపై హెడ్ మాస్ట‌ర్ అత్యాచారం..

- Advertisement -

వ‌య‌స్సుతో తేడా లేకుండా మ‌హిళ‌లు, చిన్నారుల‌పై రోజు రోజుకీ హ‌త్యాచారాలు పెరిగిపోతున్నాయి. ప్ర‌భుత్వాలు ఎన్నిక‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్నా ఆగ‌డంలేదు. తాజాగా కృష్ణా జిల్లాలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో దారుణ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపధ్యాయుడు …రెండో త‌ర‌గ‌తి చ‌దువుతున్న బాలిక‌పై అత్యాచారాణాకి పాల్ప‌డ్డ సంఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది.

వివరాల్లోకి వెల్తే….గ్రామానికి చెందిన ఓ బాలిక స్ధానికంగా ఉన్న ఓ పాఠశాలలో రెండవ తరగతి చదువుతోంది.ఓ గదిలోకి విద్యార్థినిని తీసుకెళ్లి ప్రధానోపాధ్యాయుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ నెల 22న స్కూలుకి హాజరైన ఆమె సాయంత్రం 5 గంటలకు నడవలేని స్థితిలో ఇంటికి వ‌చ్చిన బాలిక జ‌రిగిన విష‌యాన్ని త‌ల్లిదండ్రుల‌కు చెప్ప‌డంతో వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించారు. బ్లీడింగ్ ఎక్కువ అవుతుండడంతో దాన్ని ఆపేందుకు వైద్యులు మూడు కుట్లు వేశారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తమ కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన మంత్రి గంటా … చిన్నారిపై అత్యాచారం చేసిన ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేసి విచారణ చేపట్టాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -