సొంత పార్టీ నేతల మీద ఎవరైనా కోప్పడతారా ? కెసిఆర్ కొడుకు, తెలంగాణా మంత్రి కేటీఆర్ స్టైల్ వేరు మరి. ఆయన ఇతరుల మీద కాకుండా స్వయంగా తన పార్టీ జనాల మీదనే కోపం చూపించారు. ఈసారి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే గట్టిగా చర్యలు తీసుకుంటా అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు . తన పార్టీ నడిపే పెద్దలకు ఈ విషయం లో దిశా నిర్దేశం చేసిన ఆయన లాస్ట్ వార్నింగ్ అంటూ గట్టిగానే చెప్పారట.
కేటీఆర్ ఇంతగా సీరియస్ అయిన విషయం ఏంటి అని చూస్తే షాకింగ్ గా అనిపిస్తుంది. ఆయన ఫ్లెక్సీ లని తయారు చెయ్యడమే కేటీఆర్ కి ఒళ్ళు మండిన విషయం అట. మునిసిపల్ , పట్టాణాభి వృద్ధి మంత్రి గా ఉన్న కేటీఆర్ కంటోన్మెంట్ బాపూజీ నగర్ లో పర్యటన చేసారు. కొత్త వంతెన ని అక్కడ మొదలు పెట్టడానికి తన సహచర మంత్రులు పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ల తో కలిసి మొదలు పెట్టడానికి కేటీఆర్ అక్కడకి చేరుకున్నారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా స్థానిక టీఆర్ఎస్ నేతలు ఫ్లెక్సీ లు పెద్ద పెద్దవి ఏర్పాటు చేసారు.
కేటీఆర్ కి ఇవి చూడగానే మండింది. వెంటనే అక్కడే తెరాస నేతల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఫ్లేక్సీలు అనేవి లేకుండా చెయ్యాలి అనే దృడ నిశ్చయం తో తాను ఉంటె మినిమం బుర్ర లేకుండా స్వయంగా తెరాస నేతలే ఇలా చేస్తే ఎట్లా అంటూ ఆయన ఫైర్ అయ్యారు.