Tuesday, May 7, 2024
- Advertisement -

ఇద్ద‌రి మ‌ధ్య ఏజ్ గ్యాప్‌.. ప్ర‌యుడితో ప్రియురాలు జంప్ చివ‌ర‌కు…?

- Advertisement -

భార్యా, భ‌ర్త‌ల మ‌ధ్య‌నున్న ఏజ్ గ్యాప్ దారుణానికి వ‌డిగ‌ట్టేలా చేసింది. భర్తకి తనకి ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉందని అతనిని కాదని.. ఫేస్‌బుక్‌లో ప‌రిచ‌య‌మైన ప్రియుడితో పారిపోయింది ప్రియురాలు. కాని తమ ప్రేమను సమాజం అంగీకరించదనే భయంతో చివ‌ర‌కు ఇద్ద‌రూ ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఈ ఘటనలో ప్రియుడు మృతి చెందగా, ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో చోటుచేసుకుంది

వివ‌రాల్లోకి వెల్తే…పులివెందులలో ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న రఘుకు దివ్యతో పదేళ్ల క్రితం వివాహమైంది. వారికి సంతానం లేదు. అంతేకాకుండా.. రఘు వయసులో దివ్య కన్నా.. 23ఏళ్లు పెద్ద. ఈ విషయంలో దివ్య ఎప్పుడూ మదనపడుతూ ఉండేది.

ఈ క్రమంలో ప్రొద్దుటూరుకు చెందిన శ్రావణ్ కుమార్, నెల్లూరులో ఏపీ జెన్ కోలో పని చేస్తుండగా, దివ్యకు సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యాడు. వీరి పరిచయం ప్రేమగా మారగా, అప్పుడప్పుడూ రహస్యంగా కలుస్తుండేవారు. ఈ నెల 13న దివ్య అతని వద్దకు వెళ్లగా, రఘు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తిరుపతికి వెళ్లిన ఇద్దరూ, రైలులో నంద్యాలకు వచ్చారు. తాము బతకలేమని, చనిపోతున్నామని శ్రావణ్ కుమార్ తన బంధువులకు ఫోన్ చేశాడు. వారు వారిస్తుంటే వినకుండా ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. సమాజం కూడా వారి ప్రేమను అంగీకరించదనే బాధతో కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకొని తాగేశారు. నంద్యాల రైల్వేస్టేషన్ లోనే నురగలు కక్కుకొని పడిపోయారు. గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించగా.. శ్రవణ్ మృతిచెందాడు. దివ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -