నంద్యాల ఉప ఎన్నిక భయం వెంటాడుతోంది.ఎన్నిక గెలుపు కోసం బహరంగంగా పార్టీ నాయకులు బరితెగించారు.వైసీపీనీ ఎదుర్కొనేందుకు రౌడీషీటర్లను బరిలోకి దింపుతోంది.సాక్షాత్తు ఆపార్టీ నాయకులే వాల్లకు బంఫర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు.
నంద్యాల ఉప ఎన్నిక గెలుపు టీడీపీకి చావో రవో లాంటిదే. విజయం కోసం అడ్డదారులు తొక్కతోంది.ఈనేపథ్యంలో ఎలాగైనా ఉప ఎన్నికలో గెలిచేందుకు టీడీపీ నేతలు సాక్ష్యాత్తు రౌడీ షీటర్ల సాయం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా పార్టీ కోసం పని చేస్తే రౌడీ షీట్లు ఎత్తివేస్తామంటూ ఆఫర్లు ఇస్తున్నారు. నంద్యాలలో జరిగిన పార్టీ సమావేశంలో ఏకంగా జిల్లా అధ్యక్షుడే రౌడీషీటర్లకు హామీలు గుప్పించారు.
{loadmodule mod_custom,GA1}
జిల్లా అధ్యక్షుడు సోమివెట్టి వెంకటేశ్వర్లు పార్టీ సమావేశంలో… ‘రౌడీషీట్ ఉందని భయపడొద్దని .. ఈ విషయం ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు వెళ్లాం. పార్టీ కోసం పని చేస్తే రౌడీషీట్ ఎత్తేస్తామని బంఫర్ ఆఫర్ ప్రకటించారు. త్వరలో నంద్యాలకు మంత్రి లోకేశ్ పర్యటిస్తారని… మీతో సమావేశం అవుతారు.’ అని ఆఫర్ ఇచ్చారు. ఏకంగా జిల్లా అధ్యక్షుడే రౌడీషీటర్లకు హామీలు గుప్పించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
టీడీపీ గెలుపునకు మీరంతా ప్రచారంచేయాలని పిలుపునిచ్చారు.దీనిపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.ఇంతకంటె దుర్మార్గం ఉంటుందాని ప్రశ్నిస్తున్నారు.అధికార పార్టీకదా ఎంచేసినా చెల్లుతుంది మరి.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}FqucvjLMas0{/youtube}