- విజయవాడ రాజకీయాల్లో మరో సంచలనం..
- సచివాలయంలో బాబుతో మాజీ ఎంపీ లగడపాటి సమావేశం
- ఇన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్న లగడపాటి
- నానికి చెక్ పెట్టేందుకేనా
- 2019 ఎన్నికల్లో ఎంపీ టికెట్ కన్ఫర్మ్
విజయవాడ రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది. కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రోజగోపాల్ సచివాలయంలో సీఎంను కలవడం రాజకీయీల్లో హాట్ టాపిక్గా మారింది. మర్యాద పూర్వకంగానే కకలిశానని చెప్పినా రాజకీయం లేనిదే ఎందుకు కలుస్తారనేది రాజకీయ వర్గాల వాదన.రాజకీయాలకు దూరంగా ఇన్నాల్లు దూరంగా ఉన్న లగడపాటి ఇప్పుడు బాబును కలవడం చర్చనీయాశంగా మారింది.కేశినేని అలక సమయంలో కలవడంచూస్తే ఆయనకు చెక్ పెట్టేందుకే నన్న వార్తలు వినిపిస్తున్నాయి.
త్కాలిక సచివాలయాన్ని చూడటానికే వచ్చానని మే ఇంత అద్భుతంగా ఉంటే, శాశ్వత కట్టడం ఇంకెంత బాగుంటుందోనని ప్రశంసించారు. పైకి ఈమాటలు చెప్పతున్నారాజకీయం లేనిదే కలవరని రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుటున్నాయి. చంద్రబాబును లగడపాటి కలడవంపై రాజకీయంగా జోరుగా చర్చ జరుగుతోంది విజయవాడ రాజకీయాల్లో.
లగడపాటి రాజగోపాల్ పేరే తెలియని వారుండరు. ఏదైనా ఎన్నికల సర్వే పలితాలును ఖశ్చితంగా అంచనా వేయగలిగిన నేత. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒవెలుగు వెలిగిన నేత. విభజన సమయంలో పార్టమెంట్లో పెప్పెర్ స్ప్రే ఉపయేగించి దేశవ్యాప్తంగా సంచలనం కలిగించాడు.విభజన జరిగితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సంచలన ప్రకటన చేశారు. అయితే అప్పటినుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చాడు ..అప్పుడప్పుడు ఎన్నికల సర్వేలంటూ మీడియాముందుకు వచ్చేవాడు. అయితే ఇప్పుడు హటాత్తుగా సీఎం బాబును కలవడం రాజకీయాల్లో మరింత ఉత్కంటకు రేపుతోంది. ఏవిషయం లేనిదే కలకడం ఏంటనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇవన్నీ బాగానే ఉన్నా విజయవాడ ఎంపీ కేశినేనికి చెక్ పెట్టేందుకు బాబు భారీ ప్రణాలికనుల రూపొందించాడని తెలుస్తోంది. లగడపాటి ద్వారా నానికి చెక్ పెట్టడానికి బాబు వ్యూహంలా కనిపిస్తోంది.ఈమధ్యనే నాని రవాణాశాఖ అధికారిని దుర్భాషలాడటం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని బాబు దీనికి తెరతీశారని చెప్పుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో టికెట్కూడా కన్ఫర్మ్ చేసుకున్నాడని వినికిడి. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.రేపు ఇంకెన్ని సంచలనాలు నమోదవుతాయే చూడాలి.
Also Read
- చంద్రబాబుకు ముద్రగడ డెడ్ లైన్
- కొత్త ఇంటిపై బాబును ఏకేసిన పైర్ బ్రాండ్ రోజా!
- అఖిల ప్రియ చెల్లెలు మౌనిక పోటీచేస్తుందా..!
- సాక్షి చదవొద్దు అని చెబుతాడు కానీ బాబు మాత్రం చదువుతాడు