ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగియడంతో ఫలితాలకోసం అందరూ అసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫలితాలు వెలువడడానికి ఎక్కవ సమయం ఉండటంతో ప్రజలు, రాజకీయ నాయకుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఇదలా ఉంటె ఇప్పటికే ఎన్నికల ఫలితాలపై ఎన్నో సర్వేలు వచ్చాయి. అన్ని సర్వేలు జగన్కే జైకొట్టాయి.
కొన్ని సర్వేఫలితాల్లో కొన్ని జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని తేలింది. తాజాగా ఫలితాలను వెల్లడించిన సర్వేలో సెంటర్ పర్ సెఫాలజిస్ట్ స్టడీస్ సికింద్రాబాద్ వచ్చి చేరింది.సికింద్రాబాద్ కు చెందిన సెఫాలజిస్టు వేణుగోపాల్ రావు తన ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ తాజా సర్వే వివరాలు ప్రకటించారు.
ఈ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో జగన్ సునామీ ఖాయంగా కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసె మెజారిటీకాకుండా సునామీ తరహాలో జగన్ విజయం ఉంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. సీపీఎస్ సర్వే ప్రకారం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 124 స్థానాలు వరకూ గెలుచుకుంటుందని తెలుస్తోంది. ఇక అధికార తెలుగుదేశం పార్టీ 42 స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేశారు. ఇక జనసేన మాత్రం రెండు స్థానాలకంటె మించి రావని సర్వే తేల్చి చెప్పింది.
మరో 9 స్థానాల్లో హోరాహోరీ పోరు ఉందని.. ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టమని తేల్చారు. ఇక ఓట్ షేరింగ్ విషయానికి వస్తే.. 47.6 శాతం ఓట్లు సాధించిన వైసీపీ మొదటి స్థానం దక్కించుకుంటుంది. టీడీపీ 39.1 శాతం ఓట్లు తెచ్చుకుంటుం. జనసేన 8.2 శాతం ఓట్లు సాధిస్తుందని సర్వే తెలిపింది.గతంలో ఈ సంస్థ చేసిన సర్వే ఫలితాలు నిజమయ్యాయి. దీంతో ఈ సంస్థ తాజాగా వెల్లడించిన సర్వే ఫలితాలపై ప్రజలు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
సెంటర్ పర్ సెఫాలజిస్ట్ స్టడీస్ సికింద్రాబాద్ వారు ఇచ్చిన లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో
నార్త్ కోస్టల్ ఆంధ్రాలో..
వైఎస్ఆర్ కాంగ్రెస్ : 20
తెలుగుదేశం : 10
వైసీపీ – టీడీపీ మధ్య టఫ్ ఫైట్ ఉన్న స్థానాలు : 4
కోస్టల్ ఆంధ్రాలో..
వైఎస్ఆర్ కాంగ్రెస్ : 42
తెలుగుదేశం : 22
వైసీపీ – టీడీపీ మధ్య టఫ్ ఫైట్ ఉన్న స్థానాలు : 3
సౌత్ కోస్టల్ ఆంధ్రాలో..
వైఎస్ఆర్ కాంగ్రెస్ : 22
తెలుగుదేశం : 0
వైసీపీ – టీడీపీ మధ్య టఫ్ ఫైట్ ఉన్న స్థానాలు : 0
రాయలసీమ ప్రాంతంలో..
వైఎస్ఆర్ కాంగ్రెస్ : 40
తెలుగుదేశం : 10
జిల్లాల వారీగా..
శ్రీకాకుళం జిల్లాలో..
వైసీపీ : 5
టీడీపీ : 4
విజయనగరం జిల్లాలో..
వైసీపీ : 6
టీడీపీ : 2
విశాఖపట్నం జిల్లాలో..
వైసీపీ : 9
టీడీపీ : 4
వైసీపీ – టీడీపీ మధ్య టఫ్ ఫైట్ ఉన్న స్థానాలు : 1
తూర్పు గోదావరి జిల్లాలో..
వైసీపీ : 9
టీడీపీ : 10
పశ్చిమ గోదావరి జిల్లాలో..
వైసీపీ : 8
టీడీపీ : 6
కృష్ణా జిల్లాలో..
వైసీపీ : 11
టీడీపీ : 4
గుంటూరు జిల్లాలో..
వైసీపీ : 14
టీడీపీ : 2
ప్రకాశం జిల్లాలో..
వైసీపీ : 12
టీడీపీ : 0
నెల్లూరు జిల్లాలో..
వైసీపీ : 10
టీడీపీ : 0
కడప జిల్లాలో..
వైసీపీ : 10
టీడీపీ : 0
కర్నూలు జిల్లాలో..
వైసీపీ : 11
టీడీపీ : 2
అనంతపురం జిల్లాలో..
వైసీపీ : 9
టీడీపీ : 4
చిత్తూరు జిల్లాలో..
వైసీపీ : 10
టీడీపీ : 4
సర్వేఫలితా ప్రకారం చూస్తె వైఎస్ఆర్ కాంగ్రెస్ : 121 – 124, తెలుగుదేశం : 42 – 46, జనసేన : 0 – 2 సీట్లు దక్కిచుకోనున్నాయి. ఎవరు ఎన్ని సర్వేలు వెల్లడించినా ఈనెల 23 వ తేదీవరకు ఆగాల్సిందే. సర్వేలు మాత్రం రాజకీయ పార్టీలకు ఊరటనిచ్చే అంశం.