- Advertisement -
దిల్లీలో పలు పార్టీల అభ్యర్థులు మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తూర్పు ఢిల్లీ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగాడు. నామపత్రాల్లో పేర్కొన్న వివరాల ప్రకారం ఇప్పటి వరకు దేశ రాజధాని నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో మాజీ క్రికెటర్, భాజపా అభ్యర్థి గౌతమ్ గంభీర్ అత్యంత ధనవంతుడిగా తేలింది.
నామినేషన్ పత్రాల్లో తన ఆస్తి విలువ రూ. 147 కోట్లుగా ఆయన చూపాడు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను తన ఆదాయాన్ని రూ. 12.4 కోట్లుగా ఆదాయపు పన్ను రిటర్నుల్లో గంభీర్ చూపాడు. గంభీర్ భార్య నటాషా గత ఏడాది ఆదాయాన్ని రూ. 6.15 లక్షలుగా పేర్కొన్నారు మరోవైపు, తనపై ఒక క్రిమినల్ కేసు పెండింగ్ లో ఉన్నట్టు తెలిపాడు.