Wednesday, May 15, 2024
- Advertisement -

శ్మశానం నుంచి ప్రియురాలి అస్థికలు ఎత్తుకెళ్లాడు!

- Advertisement -

తమను ప్రేమించడం లేదని.. అమ్మాయినే హతం చేసే ప్రేమికులు రోజుకొకరిగా వార్తల్లోకి వస్తున్న రోజులివి! అమ్మాయిలను దారుణంగా నరికి చంపుతూ.. అదే ప్రేమ అని వారు అంటున్నారు. అదేంటి..? అంటే తాము ప్రేమించిన అమ్మాయి మరొకరికి దక్కకూడదనే కసిని వారు వ్యక్తపరుస్తుంటారు!

మరి ఇలాంటి రోజుల్లో వెలుగులోకి వచ్చిన ఒక ప్రేమికుడి కథ ఇది! హైదరాబాద్ లోని అంబర్ పేట ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకొంది. మహేశ్వరి అనే అమ్మాయిని ప్రేమించిన సాయిరామకృష్ణ అనే యువకుడు చాలా చిత్రంగా తన ప్రేమను అందరికీ అర్థం అయ్యేలా చేశాడు. ఇటీవల మహేశ్వరి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. కడుపునొప్పి తాళలేక ఆమె యాసిడ్ తాగి చనిపోయిందని కుటుంబీకులు చెబుతున్నారు. పోలీసులు కూడా అదే విధంగా కేసు ఫైల్ చేశారు.

ఆమె శవాన్ని అంబర్ పేట ప్రాంతంలోనే శ్మశానంలోనే దహనం చేశారు. ఇలాంటి నేపథ్యంలో సాయిరామకృష్ణ ఆ విషయాన్ని తెలుసుకొని ఆమె శ్మశానికి వెళ్లి ఆమె అస్థికలను తెచ్చుకొన్నాడు. శవం దహనం అయ్యాకా మిగిలిన అస్థికలను తీసుకెళ్లిపోయాడు! తను మహేశ్వరిని ఎంతగానో ప్రేమించానని.. ఆమె లేకపోయినా.. ఆమె అస్థికలు అయినా తనకు ఊరటను ఇవ్వగలవు అనేది ఆ యువకుడి తత్వం. దీనిపై మహేశ్వరి కుటుంబీకులు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -