Saturday, April 20, 2024
- Advertisement -

ట్రాన్స్​జెండర్లకు ప్రత్యేక ఆఫర్ ఇచ్చిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం..!

- Advertisement -

దేశంలోనే ట్రాన్స్​జెండర్లకు ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేసిన తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్​ నిలిచింది. ఒక కార్యక్రమంలో అర్హులకు వీటిని అందించారు. ఇందుకోసం కేటాయించిన ప్రత్యేక పోర్టల్​ నుంచి భోపాల్​కి చెందిన అంజనా సింగ్​, ఫారుక్​ జమాల్​లు ఈ కార్డులు పొందారు.కేంద్ర సామాజిక, న్యాయ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు గత నవంబర్​లోనే జాతీయ స్థాయిలో వీరికోసం ఒక హెల్ప్​లైన్​ను ఏర్పాటు చేశారు.

ఈ పోర్టల్​లో నమోదు చేసుకున్న ట్రాన్స్​జెండర్లకు సంబంధిత అధికారులు.. నిర్ధిష్ట సమయంలోగా గుర్తింపు కార్డులు జారీ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఫిర్యాదు చేసే వెసులుబాటు వెబ్​సైట్​లో కల్పించారు.ట్రాన్స్​జెండర్లు తమ గుర్తింపు కోసం అర్హత కార్డులు పొందాలంటే అధికారుల నుంచి రకరకాల అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చేది. ఈ ఆన్​లైన్ పోర్టల్​ నుంచి వీరు సులువుగా కార్డులు తీసుకోవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -