Friday, May 24, 2024
- Advertisement -

వైఎస్ జ‌గ‌న్‌ని ప‌రామ‌ర్శించిన మోహ‌న్ బాబు

- Advertisement -

గ‌త నెల 25న వైజాగ్ ఎయిర్ పోర్టులో ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్ జ‌గ‌న్‌పై హ‌త్య‌య‌త్నం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.శ్రీనివాస్ అనే యువ‌కుడు జ‌గ‌న్‌తో సెల్ఫీ తీసుకుంటాన‌ని చెప్పి,దాడికి య‌త్నించాడు.ఈ దాడిలో జ‌గ‌న్ ఎడ‌మ భుజానికి గాయం అయింది.దీంతో పలువురు ప్రముఖులు జ‌గ‌న్‌ని పరామర్శిస్తున్నారు. జగన్ గాయపడిన తొలి రోజునే పలువురు నేతలు ఆయనకు ఫోన్ చేసి ఆయ‌న ఆరోగ్యం వివ‌రాలు తెలుసుకుంటున్నారు.

తాజాగా సినీ నటుడు మోహన్ బాబు జగన్ ని కలిసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు.. దాడి ఎలా జరిగిందనే విషయంపై ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. జగన్ పై దాడి జరిగిన సమయంలోనే మోహన్ బాబు వెంటనే స్పందించి అది దుర్మార్గపు చర్య అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. జగన్ కుటుంబానికి మోహన్ బాబు కుంటుంబానికి మధ్య మంచి బంధాలు ఉన్న సంగతి తెలిసిందే.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -