సాదారనంగా పోలీసులు తీవ్రవాధులు,మావోయిస్టులనుంచి లభించిన ఆయుధాలను అప్పుడప్పుడు ప్రదర్శనకు ఉంచడం మామూలే.కానీ ఇక్కడ మాత్రం మావోలు ఆయుధ ప్రదర్శన నిర్వహించారు.అవికూడా సొంత ఆయుధాలు కాదండోయ్.పోలీసులను చంపి అపహరించిన ఆయుధాలను ప్రదర్శించార మోవోలు.
ఛత్తీస్ఘడ్ఛత్తీస్గఢ్ పోలీసుల నుంచి అపహరించిన ఆయుధాలు, మందు గుండు సామగ్రిని మావోయిస్టులు ప్రజల ఎదు ట ప్రదర్శించారు. ఆ చిత్రాలను ఛత్తీస్గఢ్ మీడియాకు మావోయిస్టు సానుభూతిపరులు విడుదల చేశారు.ఇవి ఇప్పుడు వైరల్గా మారాయి.
{loadmodule mod_custom,Side Ad 1}
గత నెల 24న సుక్మా జిల్లా బుర్కాపాల్ వద్ద సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి చేసిన మావోయిస్టులు 25 మందిని హతమార్చి పలు ఆయుధాలను, మందుగుండు సామగ్రిని అపహరించారు. ఈ ఘటన అనంతరం మావోయిస్టులు గత నెల 27న సుక్మా జిల్లాలోని సాలాతోంగ్ అనే గ్రామం వద్ద భారీ విజయోత్సవ సభ నిర్వహించారు. ఈసభలో పోలీసులనుంచి అపహరించిన ఆయుధాలను ఆదివాసీలకు ప్రదర్శించినట్లు మావోయిస్టులు తెలిపారు. ప్రజలముందు ప్రదర్శనకు ఉంచారు.
{loadmodule mod_sp_social,Follow Us}