- Advertisement -

నిరాయుధులను చంపేశారు..మావోల లేఖ

- Advertisement -

మారేడుమిల్లి ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్లపై మావోయిస్టు కేంద్ర కమిటీ సంచలన ఆరోపణలతో ఒక లేఖను విడుదల చేసింది. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఈ లేఖ విడుదలైంది.

ఈ ఎన్‌కౌంటర్లలో అగ్రనాయకులైన హిడ్మా, రాజే, టెక్ శంకర్ సహా పలువురు మావోయిస్టులను నిరాయుధులుగా పట్టుకుని, వారిపై ఉద్దేశపూర్వకంగా ఫేక్ ఎన్‌కౌంటర్‌లు చేశారని ఆ లేఖలో ఆరోపించారు. ఈ చర్యలను మావోయిస్టు కేంద్ర కమిటీ తీవ్రంగా ఖండించింది.

ప్రభుత్వాలు మరియు భద్రతా బలగాలు చేసిన ఈ “క్రూర హత్యాకాండ”కు వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలని కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో, ఈ నెల 23వ తేదీని దేశవ్యాప్త నిరసన దినంగా పాటించాలని మావోయిస్టులు కోరారు. ఈ లేఖ నేపథ్యంలో మారేడుమిల్లి ప్రాంతంలో మరింత ఉద్రిక్తత నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -