- Advertisement -
హైదరాబాద్లో నవ దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెల్తే.. ఓల్డ్ అల్వాల్కు చెందిన మున్నా మల్లేష్ (26) దంపతులు ప్రేమించుకుని 10 రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల అన్నోజి గూడ వద్ద గల రాజీవ్ గృహకల్పలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.పెళ్లి చేసుకున్న అనంతరం రాజీవ్ గృహకల్పలో నివాసముండేందుకు ఇటీవల వచ్చివెళ్లారని, మూడు రోజుల క్రితం వచ్చి ఇక్కడ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారనాలు పూర్తి గా తెలియాల్సి ఉంది.