మయన్మార్ సైనిక విమానం గగనతలంలో గల్లంతైంది. 116 మందితో వెళుతున్న మయన్మార్ సైనిక విమానం గగనతలంలో అదృశ్యమైంది. దక్షిణాది నగరం మైయిక్, యాంగాన్ మధ్య బుధవారం కనిపించకుండాపోయిందని ఆర్మీ చీఫ్….యాంగాన్ విమానాశ్రయ అధికారులు ధ్రువీకరించారు .
విమానం దవాయ్ పట్టణానికి పశ్చిమంగా 20 మైళ్ల దూరంలో ఉన్న సమయంలో విమానానికి రాడార్ కేంద్రానికి మధ్య సంబంధాలు తెగిపోయినట్లు ఆర్మీ కమాండర్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ప్రస్తుతం విమానం కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విమానంలో మొత్తం 105 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బంది ఉన్నారు.
{loadmodule mod_custom,GA1}
విమానంలో ఉన్నవారందరూ సైనికుల కుటుంబ సభ్యులని తెలుస్తోంది. సాంకేతిక లోపమే విమానం అదృశ్యానికి కారణమని, వాతావరణం బాగానే ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విమానం అదృశ్యమైనప్పుడు అండమాన్ సముద్రంపై ప్రయాణించింది. దీంతో అండమాన్ సముద్రంలో గాలింపు చేపట్టారు. ఓడలు, విమానాలను రంగంలోకి దింపారు.
{loadmodule mod_sp_social,Follow Us}