Saturday, May 18, 2024
- Advertisement -

116 మందితో వెల్తున్న విమానం గ‌ల్లంతు

- Advertisement -
Military aircraft missing carrying 116 people disappears

మయన్మార్ సైనిక విమానం గగనతలంలో గల్లంతైంది. 116 మందితో వెళుతున్న మయన్మార్ సైనిక విమానం గగనతలంలో అదృశ్యమైంది. దక్షిణాది నగరం మైయిక్‌, యాంగాన్‌ మధ్య బుధవారం కనిపిం​చకుండాపోయిందని ఆర్మీ చీఫ్‌….యాంగాన్‌ విమానాశ్రయ అధికారులు ధ్రువీకరించారు .

విమానం దవాయ్‌ పట్టణానికి పశ్చిమంగా 20 మైళ్ల దూరంలో ఉన్న సమయంలో విమానానికి రాడార్‌ కేంద్రానికి మధ్య సంబంధాలు తెగిపోయినట్లు ఆర్మీ కమాండర్‌ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ప్రస్తుతం విమానం కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విమానంలో మొత్తం 105 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బంది ఉన్నారు.

{loadmodule mod_custom,GA1}

విమానంలో ఉన్నవారందరూ సైనికుల కుటుంబ సభ్యులని తెలుస్తోంది. సాంకేతి​క లోపమే విమానం అదృశ్యానికి కారణమని, వాతావరణం బాగానే ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విమానం అదృశ్యమైనప్పుడు అండమాన్‌ సముద్రంపై ప్రయాణించింది. దీంతో అండమాన్‌ సముద్రంలో గాలింపు చేపట్టారు. ఓడలు, విమానాలను రంగంలోకి దింపారు.

{loadmodule mod_sp_social,Follow Us}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -